∙ లాడ్జిలో బూతు పనులు
• భాగ్యనగర్ కాలనీ చౌరస్తా లో గలీజ్ యవ్వారం
∙ వ్యభిచార కూపంగా కూకట్ పల్లి అడ్డా
∙ వ్యభిచార గృహాలు గా మారిన లాడ్జీలు
∙ వీధి దీపాలు కరువు
∙ జాడ లేని పోలీసుల పెట్రోలింగ్
•మారిన కూకట్ పల్లి,కేపి హెచ్ బి, అడ్డాపై “ప్రభ దినపత్రిక” స్పెషల్ ఫోకస్..!
కూకట్ పల్లి నవంబర్ 1,ప్రభ:కేపీ హెచ్ బి బస్టాండ్కు కూత వేటు దూరం…. పోలీసుల పెట్రోలింగ్ లేదు. అంతేకాదు.. ఏ ఒక్క అధికారి పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. ఇంకేముంది.. వారు ఆడిందే ఆట.. పాడిందే పాట. పగలు, చీకటి అనే తేడా లేదు.. అక్కడ నిలిపి ఉన్న లాడ్జీలను వ్యభిచార గృహాలు గా మార్చుకుంటున్నారు. లాడ్జి లోనే కాదు.. వాటి పరిసరాలను సైతం అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్గా మలుచుకున్నారు. ఇక్కడ కొంత కాలంగా న్యూసెన్స్ పరాకాష్టకు చేరుకోగా.. స్థానికులు బెంబేలెత్తుతున్నారు. వ్యభిచార కూపంగా హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి, కేపీ హెచ్ బి కాలనీలో అసాంఘీక కార్యకలాపాలు పరాకాష్టకు చేరుకున్నాయి. టూరిస్టు బస్సులకు పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు వ్యభిచార కూపాలుగా మారుస్తున్నారు. నిత్యం ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యాకలాపాల కారణంగా స్థానికులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. సాయంత్రం ఆరు దాటితే చాలు వేళల్లోనూ ఈ రోడ్డులో నడిచేందుకు మహిళలు అవస్థలు పడుతున్నారు. పోలీసుల గస్తీ కరువైపోవడంతో స్థానికులను కలవరపాటుకు గురిచేస్తోంది.
రాత్రి ఆరు దాటితే..
ఐదారేళ్లుగా ప్రైవేట్ టూరిస్టు బస్సులను కూకట్ పల్లి, కేపి హెచ్ బి సమీపంలో నిలుపుతున్నారు. ప్రతీరోజు ఇక్కడ ఇరవైకి పైగా ప్రైవేట్ బస్సులు రాత్రి, పగలు నిలిపి ఉంచుతున్నారు. ఆఫ్ సీజన్ అయితే ఒక్కోసారి 50కి పై గా బస్సులు ఆగి ఉంటాయి. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. రాత్రిపగలు తేడా లేకుండా లాడ్జి లో అపార్ట్మెంట్ సందుల్లో మధ్య రొమాన్సులు చేస్తున్నారు. ఈ తతంగం రోజూవారీ కార్యక్రమంగా కొనసాగుతున్నా అడ్డుకునే వారే కరువయ్యారు. ఫలితంగా ఇటీవల కాలంలో కూకట్ పల్లి, కెపిహెచ్ బి భాగ్యనగర్ మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చే కొందరు యువతీయువకులు ఈ అడ్డాపై ఆకర్షితులవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
తలెత్తుకోలేక పోతున్నాం…
కొందరు వ్యభిచారులు టూరిస్టు బస్సుల అడ్డాను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. కేపి హెచ్ బి, కూకట్ పల్లి భాగ్యనగర్ చౌరస్తా వంటి జనసంచారం కలిగిన ప్రాంతాల్లో విటులను ఆకర్షించిన తర్వాత లాడ్జి అడ్డాకు చేరుకుంటున్నారు. కొందరు లాడ్జి క్లీనర్లు లాడ్జి లను వ్యభిచార కేంద్రాలుగా మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. కూకట్ పల్లి,కెపిహెచ్బి,భాగ్యనగర్ కాలనీ సమీపంలో వచ్చే యువకులను తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఓయో రూమ్ పేరుతో లాడ్జిల లో వ్యభిచారం చేస్తున్న అంశాన్ని బీట్ కానిస్టేబుళ్లకు, పెట్రోలింగ్ సిబ్బందికి పలుమార్లు కాలనీవాసులు పట్టించారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు.






